loading

0%

భవిష్యత్ ప్రణాళిక కార్యక్రమానికి డీసీఎఫ్ ఆర్గనైజర్లు, మండల కోఆర్డినేటర్లకు ఆహ్వానం

భవిష్యత్ ప్రణాళిక కార్యక్రమానికి డీసీఎఫ్ ఆర్గనైజర్లు, మండల కోఆర్డినేటర్లకు ఆహ్వానం

విజయవాడ: డీసీఎఫ్ (Dudekula Care Force) ఆధ్వర్యంలో నిర్వహించనున్న భవిష్యత్ ప్రణాళిక కార్యక్రమం ఈ నెల ఆగస్టు 09, 2026 (ఆదివారం) విజయవాడ సమీపంలోని ఉండవల్లి, రాజ గృహ గెస్ట్ హౌస్‌లో జరగనుంది.

ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీసీఎఫ్ ఆర్గనైజర్లు మరియు మండల కోఆర్డినేటర్లు తప్పనిసరిగా హాజరుకావాలని డీసీఎఫ్ స్టేట్ టీం పిలుపునిచ్చింది.

సంస్థ భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ విస్తరణ, సేవా కార్యక్రమాలు, జిల్లా మరియు మండల స్థాయి కార్యాచరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా డీసీఎఫ్ స్టేట్ టీం మాట్లాడుతూ, ప్రతి ఆర్గనైజర్ మరియు మండల కోఆర్డినేటర్ సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరింది.

"అందరూ తప్పక హాజరై, డీసీఎఫ్ భవిష్యత్ కార్యాచరణకు తమ విలువైన సూచనలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి."

డీసీఎఫ్ స్టేట్ టీం